
తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటించనున్నారు. మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, సూచనలు తెలుసుకోనున్నారు.
రైతులతో సమావేశం అనంతరం రాజముద్రతో కొత్తగా మంజూరైన పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం స్వయంగా పంపిణీ చేయనున్నారు. ఆయన పర్యటనను పురస్కరించుకుని రాయవరంలో భారీ ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

