నల్గొండ –
మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడా చౌరస్తా వద్ద గురువారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ను డీసీఎం ఢీకొట్టడంతో ఘటన భారీగా మారింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులంతా బీహార్కు చెందిన కూలీలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదం…
RELATED ARTICLES

