
పల్నాడు జిల్లా మత్స్యశాఖ అధికారి సస్పెండ్
పల్నాడు జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావుపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ఇచ్చే వాహనాలు, బోట్లు మంజూరులో చేతివాటం, అర్హతలేని వారికి లబ్ధి కల్పించడం, లైసెన్సుల జారీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. సుమారు రూ.3 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు విచారణలో నిజమని తేలినట్లు విచారణాధికారి నివేదిక సమర్పించారు. దీంతో రమాశంకర్ నాయక్ సంజీవరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

