Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్సమిష్టిగా వెళ్దాం

సమిష్టిగా వెళ్దాం

📰 Generate e-Paper Clip


ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. మంగళగిరిలో జరిగిన 11వ బ్యాచ్ క్యాడర్ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, కూటమి నేతల మధ్య సఖ్యతతో కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధితో పాటు దుష్ప్రచార రాజకీయాలను కూడా ధీటుగా ఎదుర్కోవాలని, తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కోసం చేస్తున్న సేవలను My TDP యాప్‌లో నమోదు చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular