అమెరికా వాషింగ్టన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన కృష్ణకిశోర్, ఆశ దంపతులు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి కుమారుడు, కుమార్తె చికిత్స పొందుతున్నారు.
పది రోజుల క్రితమే స్వగ్రామం పాలకొల్లుకు వచ్చి వెళ్లిన ఈ కుటుంబం, మార్గమధ్యంలో దుబాయ్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నట్లు సమాచారం. ఇంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది.
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న కృష్ణకిశోర్ మృతితో పాలకొల్లులో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.