rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 2:12 pm Digital Edition : RAKSHANA DAILY DESK

రెవెన్యూ సేవలు

బాపట్ల, జనవరి 4:
జిల్లాలో ప్రతి మండలం, రెవెన్యూ డివిజన్‌లలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్.వి తెలిపారు. రైతులు భూమి సంబంధిత సమస్యల పరిష్కారానికి తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలను సంప్రదించవచ్చన్నారు.
ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, కేవలం రూ.40 నుంచి రూ.100ల నామమాత్రపు రుసుముతో సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.