rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 7:19 am Digital Edition : RAKSHANA DAILY DESK

పోలవరంలో సీఎం హైఅలర్ట్.. ప్రాజెక్టు పనులపై నేరుగా సమీక్ష

పోలవరం: పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ప్రాజెక్టు హెలిపాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. అంతకుముందు ఏరియల్ విజిట్ ద్వారా పనుల పురోగతిని వీక్షించిన సీఎం, వ్యూ పాయింట్ నుంచి స్పిల్‌వే సహా మొత్తం ప్రాజెక్టును పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్‌తో పాటు ఇతర కీలక నిర్మాణాలపై సీఎం సమీక్ష చేపట్టారు.