rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 7:18 am Digital Edition : RAKSHANA DAILY DESK

మర్యాదపూర్వకంగా..

గుంటూరు:
జిఎంసి నూతన కమిషనర్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించిన కె. మయూర్ అశోక్, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ భేటీలో నగర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. నగర సుందరీకరణ, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.