రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన ముగించుకుని విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖతో పాటు పరిసర జిల్లాల్లో మూడు రోజులపాటు పర్యటిస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని, స్వాగత కార్యక్రమాల్లో పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని అధికారులు సూచించారు. ప్రజల అర్జీల స్వీకరణకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
