rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 7:54 am Digital Edition : RAKSHANA DAILY DESK

డిజీపి ని కలవాలి…

పిన్నెల్లి సాల్మన్ రాజ్‌కు న్యాయం చేయాలి

డీజీపీని కలిసేందుకు వెళ్లిన వైసీపీ నేతలు

అనుమతి నిరాకరించిన పోలీసులు –

తాడేపల్లిలో ఉద్రిక్తత

మాచర్లకు చెందిన వైసీపీ కార్యకర్త పిన్నెల్లి సాల్మన్ రాజ్‌కు న్యాయం చేయాలని కోరుతూ వైసీపీ నేతలు తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా డీజీపీని కలిసేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
పోలీసుల వైఖరికి నిరసనగా డీజీపీ కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యంలో ఫిర్యాదులు వినిపించే హక్కు ఉన్నప్పటికీ, అధికారుల కలయికకు అడ్డంకులు సృష్టించడం అన్యాయమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిన్నెల్లి సాల్మన్ రాజ్ విషయంలో జరుగుతున్న పరిణామాలపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తాడేపల్లి డీజీపీ కార్యాలయం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.