


కంటోన్మెంట్లో 5వ రోజు రిలే నిరహార దీక్ష కొనసాగింపు
కంటోన్మెంట్ బోర్డును నామినేటెడ్ వ్యవస్థ నుంచి విముక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఎల్సీ బల్మూరి వెంకట్ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. నియోజకవర్గంలోని క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ సోదరులు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. కంటోన్మెంట్ ప్రజల ఆకాంక్షలను గుర్తించినందుకు, మద్దతు తెలిపిన వారందరికీ ఎమ్మెల్యే శ్రీగణేష్ ధన్యవాదాలు తెలిపారు.